నిన్న తొలి ఇన్నింగ్స్లో INDను 119 రన్స్కే PAK కట్టడి చేయడంతో ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. ‘పాక్ టీమ్ గ్రేట్ బౌలింగ్. టోర్నీలో ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. ఛేజింగ్కు దిగే అబ్బాయిలకు ఆల్ ది బెస్ట్’ అని రాసుకొచ్చారు. అయితే పాక్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆయన మళ్లీ ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో ‘గుర్తుపెట్టుకోండి.. ఎప్పుడూ ముందే సంబరాలు చేసుకోవద్దు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.