పెట్రోల్ కోసం వచ్చిన ఓ కస్టమర్పై బంక్ సిబ్బంది దాడి చేసి కొట్టారు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో చోటుచేసుకుంది. అక్కడి ఇండియన్ ఆయిల్ బంక్లోకి వచ్చిన కస్టమర్తో సిబ్బందికి వివాదం తలెత్తింది. దీంతో బంక్ సిబ్బంది మొత్తం చేరి ఆ కస్టమర్పైకి దాడికి దిగారు. అందరూ కలిసి దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.