రైలు నుంచి పడి గర్భిణి మృతి

తమిళనాడులోని వృద్ధాచలం సమీపంలో కొల్లాం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పడిన గర్భిణి కస్తూరి చనిపోయింది. రైలు నుంచి కస్తూరి కింద పడిపోవడంతో బంధువులు రైలులోని సేఫ్టీ చైన్ లాగారు. అది పని చేయలేదు. దీంతో రైలు 8 కిలోమీటర్లు ముందుకు పోయి ఆగింది. ఉలుందూరుపేట సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. బేబీ షవర్ కోసం ఆమె వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్