కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ నుంచి గెలిచారు. కాంగ్రెస్ వర్గాల ప్రకారం ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో నిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. తొలిసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీని గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు సమాయత్తం అవుతున్నారు.