బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తాజాగా, అతడు ఓ బస్సులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. నిందితుడి ఫొటోను ఎన్ఐఏ విడుదల చేయడంతో పాటు ఆచూకీ లేదా వివరాలు చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.