రామోజీరావు మరణం తీరని లోటు: రాష్ట్రపతి

ఈనాడు గ్రూప్‌ సంస్థల రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. ఆయన మృతి మీడియాకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈనాడు, ఈటీవీ, ఫిల్మ్ సిటీ సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న కృషికి గాను రామోజీరావుకు పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందన్నారు. ఆయన సేవలు మరువలేనివని.. రామోజీరావు కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్