తెలంగాణలో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ఉన్న 8 మందిని అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. 16 మంది పిల్లలను రక్షించామని చెప్పారు. దిల్లీ, పుణెల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని వ్యాఖ్యానించారు.