2022 డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత 15 నెలల పాటు భారత స్టార్ రిషభ్ పంత్ క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు. ‘‘తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు నరకయాతన అనుభవించా’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అదరగొట్టడంతో 2024 ప్రపంచ కప్కు పంత్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.