దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్లోని బార్మర్లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్లకు వాతావరణ శాఖ ‘రెడ్’ హెచ్చరికను జారీ చేసింది.