రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీకి భంగపాటు తప్పదని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. విపక్ష ఇండియా కూటమికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. రోజురోజుకూ తమ కూటమికి ప్రజాదరణ పెరుగుతున్నదని చెప్పారు.