ఆరో దశ ఎన్నికల బరిలో 889 మంది అభ్యర్థులు

68చూసినవారు
ఆరో దశ ఎన్నికల బరిలో 889 మంది అభ్యర్థులు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. గురువారంతో ఆరో దశ పోలింగ్ కోసం ప్రచారానికి కూడా తెరపడింది. మే 25న 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఓటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేయనున్నాయి. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 20 మంది పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్