ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కూటమికి మద్దతిచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించినా ఆయా చోట్ల ఎంవీఏ విజయకేతనం ఎగురవేసిందని తెలిపారు. అందుకే మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నానని, ఇది నా కర్తవ్యమని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.