తెలంగాణలో వేసవి రాకముందు నుంచే డిమాండ్ ఉన్న బీర్లు దొరకడం లేదు. బీర్లు స్టాక్ ఉండడం లేదు. దీంతో బీరు ప్రియులు ఊరు, పేరు లేని బ్రాండ్లను తాగాల్సి వచ్చింది. దీనిపై విపక్షాలు రేవంత్ సర్కార్పై విమర్శలు చేశాయి. ఎక్సైజ్ మంత్రి జూపల్లి స్పందిస్తూ రాష్ట్రంలో కొత్త మద్యం విక్రయాలకు ఎవరూ దరఖాస్తు చేయలేదని ప్రకటించారు. కానీ, 4 రోజులకే సోమ్ డిస్టిల్లరీస్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చర్చనీయాంశమైంది.