తెలంగాణ ఈఏపీ సెట్కు గత పదిసంత్సరాల్లో లేనతంగా విద్యార్థులు ఈసారి దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని, గతంలో ఒక్కో షిఫ్ట్లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాస్తే ఈసారి ఒక్కో షిఫ్ట్లో 50 వేల మంది పరీక్ష రాసినట్లు వివరించారు.