ఢిల్లీలో మునిగిన రోడ్లపై బీజేపీ కౌన్సిలర్ నిరసన.. వీడియో వైరల్

ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మునిగిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నీళ్లు నిలిచిన రోడ్డుపై తేలికపాటి పడవలో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వర్షాకాలం ఉందని తెలిసి కూడా ఆప్ ప్రభుత్వం డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోందని విమర్శించారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారని ఫైరయ్యారు.

సంబంధిత పోస్ట్