టీ20 వరల్డ్ కప్-2024 తొలి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. న్యూయార్క్లో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ను 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ చేశారు. ప్రస్తుతం మెకార్తీ వేసిన ఎనిమిదో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. రిషభ్ పంత్ (17) ఐదో బంతికి ఫోర్ బాదాడు. 8 ఓవర్లకు స్కోరు 52/1. రోహిత్ (30) క్రీజులో ఉన్నాడు.