కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తానని సీఎం రేవంత్ అన్నారు. తుక్కుగూడ సభలో సీఎం మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారని.. పదేళ్లలో వందేళ్ల విధ్వంశం సృష్టించారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు.