జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కశ్మీర్లోని షోపియాన్లో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచి ఐజాజ్ షేక్ గాయపడ్డారు. అలాగే యన్నర్లోని పర్యాటకుల రిసార్టువద్ద పర్యాటకుల క్యాంప్పై కూడా వారు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. గాయపడిన వారిని తబ్రేజ్, ఫర్హాగా గుర్తించారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.