భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట మండలం నారమువారిగూడెం వద్ద కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చేశారు. మరో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులు దుర్గారావు(63), వెంకటలక్ష్మి(34)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.