ఏడాది వయసు నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఇప్పటికే ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అయితే చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వేయనుంది.