లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాల్లో ఓట్ల పండుగ జరగనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్లోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్లోని 7, బిహార్లోని 5, ఒడిశాలోని 5, జార్ఖండ్లోని 3, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్లోని చెరో లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని 8.95 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు.