మెదక్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కౌడిపల్లి మండలం రాయిలపూర్ శివారులోని కోళ్ల ఫారం గోడ కూలింది. ఈ ప్రమాదంలో కోళ్ల ఫారంలో నిర్మాణ పనికి వెళ్లిన ఇద్దరు మేస్త్రీలు మృతి చెందారు. మృతులు ఏపీవాసులు సుబ్రహ్మణ్యం(45), మాదాస్ నాగు(35)గా గుర్తించారు.