గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రాంచందర్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ అరెస్టు అయ్యారు. ప్రభుత్వ సొమ్మును రాంచందర్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ వచ్చాయి. ఈ మేరకు చర్యలు తీసుకున్న పోలీసులు.. రాంచందర్, కల్యాణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ.2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.