దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఆ ఉష్ణోగ్రతను దాటి ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.