ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ కీలక సహాయకుడు వీకే పాండియన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గతేడాది నవంబర్లో సివిల్ సర్వీసెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరిన వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఒక వీడియోను విడుదల చేశారు. బిజూ పరివార్తో కలిసి ఉండే కార్యకర్తలతో పాటు మొత్తం బిజూ పరివార్కు క్షమాపణలు చెబుతున్నానంటూ చెప్పారు.