లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పంజాబ్లోని అమృత్సర్లో ఏర్పాటు చేసిన సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఆకట్టుకుంది. బ్యాండు బాజాలతో ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో బూత్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మొత్తం 57 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఎగబడుతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం పలు ఏర్పాట్లు చేస్తోంది.