ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. నిన్న రాజస్థాన్ తో ‘‘మ్యాచ్ ముగిశాక సూపర్ ఫ్యాన్స్ అందరూ స్టేడియంలోనే ఉండాలని కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు’’ అని మ్యాచ్కు ముందు సామాజిక మాధ్యమాల్లో సీఎస్కే పోస్టు చేసింది. మ్యాచ్ ముగిశాక చెన్నై ఆటగాళ్లతో కలిసి ధోని మైదానంలో తిరుగుతూ స్టాండ్స్లోని అభిమానులకు అభివాదం చేశాడు.