నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని.. వైసీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కార్యాలయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ స్థలం సుమారు 110 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. ఈ కార్యాలయానికి అవసరమైన అనుమతులు లేవని అధికారులు ధృవీకరించారు.