ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింజలి, కంటాబంజి స్థానాల్లో పోటీచేసిన నవీన్.. కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్బాగ్ చేతిలో ఓడిపోయారు. అయితే హింజలి ఎమ్మెల్యేగా మంగళవారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసి నవీన్ వెళ్తుండగా లక్ష్మణ్బాగ్ లేచి నమస్కరించారు. ఆయనకు నవీన్ ప్రతినమస్కరిస్తూ.. ‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’ అని అన్నారు.