ఏపీ అభివృద్ధి కోసమే టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాయని పవన్ కళ్యాణ్ అన్నారు. "వలసలు, పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే NDA లక్ష్యం. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేం నిలబడ్డాం. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం." అని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సభలో పవన్ హామీ ఇచ్చారు.