కార్మికులకు బోనస్ చెల్లించాలి

71చూసినవారు
అనకాపల్లి జిల్లాలోని ఫార్మా పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు దసరా బోనస్ చెల్లించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికులతో కలిసి పరవాడలో గురువారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. వేతనాల్లో 20% బోనస్ గా కార్మికులకు చెల్లించాలన్నారు. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు బోనస్ చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్