90% రాయితీపై రైతులకు వరి విత్తనాలు పంపిణీ

85చూసినవారు
ప్రభుత్వం రైతులకు 90% సబ్సిడీపై మంజూరు చేసిన వరి విత్తనాలను మంగళవారం కొయ్యూరు మండలంలోని నడింపాలెం ఆర్భికే వద్ద పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కార్యదర్శి భీమరాజు సర్పంచ్ రాము పాల్గొని వారి చేతుల మీదుగా 150 మంది రైతులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రైతులు తప్పకుండా తమ పంట పొలంలో విత్తనాలు నాటి లబ్ధి పొందాలని కోరారు. ఇందులో టీడీపీ నేతలు సాంబశివరావు వెంకటరమణ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్