మర్రిపాలెం హర్షనగర్లో నివాసం ఉంటున్న టి.గణపతి ఆటో ను సోమవారం రాత్రి ముగ్గురు యువకులు, ఓ యువతి దొంగలించారు. అదే ఆటోలో మంగళవారం ఉదయం సింహాచలం గోశాల వద్ద ఉన్న ఒక తుక్కు దుకాణ యజమాని సర్వేశ్వరావు వద్దకు వెళ్లి ఆటో మరమ్మతులు చేయాలని దుకాణంలో ఉన్న సామగ్రిని తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నగదు ఉందని గ్రహించి దాడి చేసి రూ.10 వేలు నగదు తో పరారయ్యారు. ఈ ఘటన తుక్కు దుకాణం వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా వెంటనే తక్కు దుకాణం యజమాని కుమారుడు ఆటో నెంబర్ ఆధారంగా ఆటో యజమానికి ఫోన్ చేయగా ఆటో కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన పై రెండు చోట్ల కేసు నమోదైంది.