రైతులు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు

85చూసినవారు
రైతులు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు
ఏజెన్సీలోని గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు తయారు చేసి సమర్పించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా. సింహాచలం అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో వ్యవసాయ శాఖ అధికారులతో, పశుసంవర్ధక శాఖ అధికారులతో, ఆర్టికల్చరల్ అధికారులతో, కృషి విజ్ఞాన కేంద్ర అధికారులతో గిరిజన రైతులు అభివృద్ధి చెందే విధంగా ప్రాజెక్ట్ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్