విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు పురస్కరించుకుని గురువారం మహా అన్నదానం ఆలయ వద్ద దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. దేవస్థానం వారు 5000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రాజగోపాల్రెడ్డి, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, ఉరుకుటి నారాయణ రావు పాల్గొన్నారు.