విశాఖ ఉమ్మ‌డి జిల్లాల జ‌డ్పీ సీఈవోగా నారాయ‌ణ‌మూర్తి

72చూసినవారు
విశాఖ ఉమ్మ‌డి జిల్లాల జ‌డ్పీ సీఈవోగా నారాయ‌ణ‌మూర్తి
విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా ప‌రిష‌త్ సీఈవోగా పి. నారాయ‌ణ‌మూర్తి సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ను త‌న ఛాంబ‌ర్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు డీఎల్డీవోగా ఉన్న ఈయ‌న కాకినాడ జ‌డ్పీ సీఈవో(ఎఫ్. ఎ. సి. )గా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఇటీవ‌ల జ‌రిగిన బ‌దిలీల్లో ప‌దోన్న‌తిపై విశాఖ‌ప‌ట్ట‌ణం జ‌డ్పీ సీఈవోగా విచ్చేశారు.

సంబంధిత పోస్ట్