అనకపల్లి: ఓబీసీ నేత జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

69చూసినవారు
అనకపల్లి: ఓబీసీ నేత జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
జ్యోతిరావు పూలే ఓబీసి అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ ఆడారి కుమారస్వామి జన్మదినోత్సవం సందర్భంగా వారి అభిమానులు ఆదివారం అనకాపల్లి పట్టణంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. గాంధీనగర్ బీసీ హాస్టల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గాజువాక స్వామి వివేకానంద మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ కి టిఫిన్ బాక్సులు వితరణగా అందించారు. రోడ్డు పక్క నిరాశ్రయులకు ఆహార పొట్లాలు అందించారు.

సంబంధిత పోస్ట్