అనకాపల్లి జిల్లా చోడవరం లో ప్రభుత్వ, పంచాయతీ స్థలాలను, రోడ్లు, డ్రైనేజీలు, పాత చెరువును దర్జాగా కబ్జా చేసిన బడా బాబుల పై ఎటువంటి చర్యలు తీసుకోలేని అధికారులు కళ్ళు, పేదల నివాసాలు పై పడ్డాయని భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏ. పి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలు పేదలపై మంగళవారం ఆక్రమణలు పై చర్యలు అంటూపంజా విసిరారన్నారు