పీ.హెచ్.సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
పెందుర్తి మండలం నరవ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలను తెలుసుకున్నారు. డయాబెటిస్ రోగులకు పరీక్షలు నిర్వహించేందుకు ఉదయం వేళ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్