అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మృతిపై ఈ నెల 26న సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తక్షణమే స్పందించారు. బుదవారం అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బేల్దారులయిన దస్తగిరి, బాలులను అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మృతి ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.