అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి. హిరేహాల్ మండలం మురడి గ్రామంలో మురిడప్ప అనే వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఆయన మృతదేహాన్ని చూసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరింత పూర్తి సమాచారం అధికారులు వెల్లడించాల్సి ఉంది.