సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని గురువారం శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ అన్నారు. శింగనమల మండలం ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ఆలూరు సాంబ శివారెడ్డి నిర్వహించారు.