హిందూపురం పట్టణంలోని మేళాపురంలో నివాసముంటున్న వివాహిత గంగోత్రి(21) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం మడకశిర నియోజకవర్గం కల్లూరు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. ఇటీవల గర్భం దాల్చిన ప్రసవానికి పుట్టింటికి వచ్చింది. అయితే రెండు నెలల క్రితం పురిట్లోనే బిడ్డ మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.