కోడూరుకు రూ. 5.58 లక్షల ఆదాయం

82చూసినవారు
కోడూరుకు రూ. 5.58 లక్షల ఆదాయం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు పంచాయతీ పరిధిలో కోడూరు పెద్ద చెరువులో చేపల పెంపకానికి, వారపు సంత నిర్వహణకు బుధవారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ మురళీమోహన్ మాట్లాడుతూ పెద్ద చెరువును గంగాధర్ అనే వ్యక్తి రూ. 5.13 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారని చెప్పారు. అలాగే వారపు సంతను రూ. 45, 500 కు శివానంద అనే వ్యక్తి దక్కించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్