కుందుర్పి మండలం కొలిమి పాల్యం రైతు భరోసా కేంద్రంపై ఉన్న వైఎస్ జగన్ ఫొటోను సోమవారం ధ్వంసం చేశారు. సుత్తి, కొడవలి సహాయంతో రైతు భరోసా కేంద్రం భవనంపై ఉన్న జగన్ ఫోటోలను తొలగించారు. అంతేకాకుండా శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రైతు భరోసా కేంద్రం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.