నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

51చూసినవారు
నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ కలసి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందించాలని, మడకశిర బ్రాంచ్ కెనాల్ ను ఆధునీకరించాలని, పాలసముద్రం వద్ద నాసన్, కియా అనుబంధ సంస్థలు ఉన్నాయని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నందున పరిశ్రమలకు సమృద్ధిగా నీరు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్