కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: మాజీ మంత్రి

71చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి, శ్రీసత్య సాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం సమన్వయ కర్త ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లి మండలం తొంగోడు గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉషాశ్రీచరణ్ మీడియాతో మాట్లాడుతూ.. తల్లికి వందనం తదితర హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్