ప్రచారం ముమ్మరం చేసిన బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి

68చూసినవారు
రాయదుర్గం డి హిరేహాల్ మండలంలో బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాపరెడ్డి సోమవారం విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మురడి, కల్యం గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న స్థలానికి వెళ్లి మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ఉపాధి హామీ కూలి జీతాలను పెంచుతామని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోయింది చాలన్నారు. ఒక్కసారి రైతు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలన్నారు.

సంబంధిత పోస్ట్