రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

15127చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని ఎస్ కొత్తపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురైన ఆ వ్యక్తి వివరాలు తెలియలేదు. స్థానికులు, గుమ్మగట్ట పోలీసులు, అంబులెన్స్ ప్రమాద స్థలికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్