పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: కాలవ

2604చూసినవారు
పింఛన్ల పంపిణీపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, రాయదుర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తూ దానిని టిడిపిపై నెట్టడం దుర్మార్గమన్నారు. టిడిపి ఎక్కడా కూడా పింఛన్లను అందించవద్దని చెప్పలేదన్నారు. వైసిపి తప్పుడు ప్రచారాలను ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్